
రాయచోటి రూరల్: దువ్వూరు మండలం జిల్లెళ్ల గ్రామానికి చెందిన వరాలు, వరప్రసాద్ దంపతులు తమ ఏడాది చంటి పిల్లాడిని తీసుకొని జగన్మోహన్రెడ్డి వద్దకు వచ్చారు. తమ బిడ్డకు పేరు పెట్టాలని కోరగా, నాన్న పేరు పెడదామని అన్నారు. ఆ చిన్నారికి రాజశేఖర్ అని జగన్ నామకరణం చేశారు. దీంతో ఆ దంపతులు, కుటుంబ సభ్యులు సంబరపడిపోయారు.