హైదరాబాద్: నిరుద్యోగుల్లో అసంతృప్తి సమాజానికి మంచిది కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. నిరుద్యోగులను పట్టించుకోవాలని, వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి శనివారం బహిరంగ లేఖ రాశారు. నిరుద్యోగుల గోడు వినేందుకు చంద్రబాబు తీరిక చేసుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, ఇచ్చిన మాట మరిచిపోవడం వల్లే మరోసారి తాను ఈ లేఖ రాయాల్సి వచ్చిందంటూ గుర్తు చేశారు.
వెంటనే నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని, ఇచ్చిన హామీ మేరకు ఇప్పటి వరకు చెల్లించాల్సిన బకాయిలతో రూ.2వేల నిరుద్యోగ భృతిని వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికల వాగ్దానాలను నెరవేర్చాలని, అధికారంలోకి వచ్చి 35 నెలలు గడిచినా ఇప్పటి వరకు ఏ ఒక్కరికీ నిరుద్యోగ భృతి అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయంపై ఫిబ్రవరిలో బహిరంగ లేఖ రాసిన విషయాన్ని గుర్తు చేశారు. అయినప్పటికీ చలనం లేని తీరుగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. గ్రూప్స్ పరీక్షలను మొక్కుబడిగా జరుపుతున్నారని మండిపడ్డారు. నిరుద్యోగుల్లో ప్రభుత్వం తరుపున ఎలాంటి భరోసా కనిపించడం లేదన్నారు.
ఏపీపీఎస్సీ అధికారులు కూడా నిరుద్యోగుల గోడు పట్టించుకోవడం లేదని, వారి అభిప్రాయం కూడా వినకపోవడం తననెంతో బాధించిందని, కనీసం వారి అభిప్రాయాలకు విలువ ఇవ్వాలని హితవు పలికారు. తీవ్ర నిరుద్యోగం, నిరుద్యోగుల్లో అసంతృప్తి సమాజానికి మంచిదికాదని హెచ్చరించారు. తాను రాస్తున్న లేఖలో గొంతెమ్మ కోర్కెలు లేవన్న వైఎస్ జగన్.. ప్రజలకు ఇచ్చిన హామీలనే నెరవేర్చాలని కోరుతున్నానని చెప్పారు.
గొంతెమ్మ కోరిక కాదు.. నిరుద్యోగుల గోడు: వైఎస్ జగన్
Published Sat, May 6 2017 7:51 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘ఎంపీలకు పట్టని అభివృద్ధి’
జోరుగా బీజేడీ ప్రచారం
30 కిలోల గంజాయి స్వాధీనం
కింగ్కోబ్రా హల్చల్
సొంతగూటికి కాశీనగర్ ఎన్ఏసీ చైర్పర్సన్ సుధారాణి
పూరీ కాంగ్రెస్ కార్యకర్తల ఆగ్రహం
నేడు రాష్ట్రానికి ప్రధాని మోదీ
కొట్పాడ్లో త్రిముఖ పోటీ!
కుంద్రా సమితిలో ఫ్లాగ్ మార్చ్
హోమ్ ఓటింగ్కు 4,000 మంది మొగ్గు
తప్పక చదవండి
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement