రేవు బాబురావు మృతిపట్ల వైఎస్‌ జగన్‌ సంతాపం

YS Jagan Mohan Reddy Condolences To Revu Babu Rao Death - Sakshi

సాక్షి, అమరావతి: మత్స్యకార వర్గ నాయకుడు రేవు బాబురావు మృతికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం ప్రకటించారు. మత్స్యకార వర్గానికి ఆయన మృతి తీరని లోటు అని శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.  

ద్వారకానగర్‌(విశాఖ దక్షిణ): మత్స్యకార సంఘం జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ రేవు రత్నకుమారి భర్త రేవు బాబూరావు(77) అనారోగ్యంతో శనివారం విశాఖపట్నంలోని రైల్వే న్యూకాలనీలోని ఆయన స్వగృహంలో మృతిచెందారు. ఆయన కనకమహాలక్ష్మి కో–ఆపరేటివ్‌ బ్యాంక్‌ డైరెక్టర్‌గా కూడా ఉన్నారు. అంత్యక్రియలు సోమవారం ఉదయం 8 గంటలకు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. 

మత్స్యకార సంఘం సంతాపం
కోస్తా మత్స్యకార సంఘం ఆధ్వర్యంలో ఎంవీపీ కాలనీలో ఏర్పాటు చేసిన సమావేశంలో బాబూరావు మృతికి సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా ఎస్టీ సాధన సమితి కన్వీనర్‌ మూగి శ్రీరామ్మూర్తి మాట్లాడుతూ బాబూరావు మత్స్యకారులకు ఎంతో సేవ చేశారని, ఆయన మృతి మత్స్యకారులకు తీరని లోటన్నారు. కార్యక్రమంలో సంఘం నాయకులు తెప్పల శాంతారాం, కె.తాతారావు, కదిరి రాము, తెడ్డు శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top