రామారావుపై కేసుల తొలగింపుపై చర్చించాలి | ys jagan mohan reddy appeals to speaker over tv ramarao cases discussion | Sakshi
Sakshi News home page

రామారావుపై కేసుల తొలగింపుపై చర్చించాలి

Sep 3 2014 10:24 AM | Updated on Aug 18 2018 5:15 PM

రాష్ట్రవ్యాప్తంగా ఔట్ సోర్సింగ్ సిబ్బంది తొలగింపుతో పాటు, టిడిపి మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావుపై కేసుల తొలగింపుపై చర్చ జరగాలని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోరారు.

హైదరాబాద్ :  రాష్ట్రవ్యాప్తంగా ఔట్ సోర్సింగ్ సిబ్బంది తొలగింపుతో పాటు, టిడిపి మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావుపై కేసుల తొలగింపుపై చర్చ జరగాలని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన బుధవారం  స్పీకర్‌ కోడెల శివప్రసాద్కు విజ్ఞప్తి చేశారు. ప్రశ్నోత్తరాల ప్రారంభంలో ఈ అంశాలను ప్రతిపక్ష నేత ప్రస్తావించడంతో.. స్పీకర్ అభ్యంతరం చెప్పారు. వాయిదా తీర్మానం అంశానికి తగిన సమయంలో సమాధానం ఇస్తారని సూచించారు. మరో అంశాన్ని అప్పటికప్పుడు ప్రస్తావించడం సరికాదని తేల్చి చెప్పారు.

 

Advertisement
 
Advertisement
Advertisement