అర్హతలేని వ్యక్తికి అందలమా!? | APGEF Chairman Kakarla Venkataramireddy warns the government | Sakshi
Sakshi News home page

అర్హతలేని వ్యక్తికి అందలమా!?

Apr 10 2026 5:35 AM | Updated on Apr 10 2026 5:35 AM

APGEF Chairman Kakarla Venkataramireddy warns the government

చట్టసభల్లో పనిచేసిన అనుభవంలేని వ్యక్తిని అసెంబ్లీ సెక్రటరీ జనరల్‌గా ఎలా నియమిస్తారు?

కనీసం విద్యార్హతలను కూడా పట్టించుకోని ప్రభుత్వం

ఎస్‌ఓ కంటే తక్కువ కేడర్‌ ఉద్యోగికి అసెంబ్లీలో అత్యున్నత పోస్టా?

సీఎస్‌ కంటే అత్యధికంగా రూ.4.90 లక్షల జీతమా?

వెంటనే ఆయన్ను తొలగించాలి.. లేకుంటే న్యాయ పోరాటం చేస్తాం

ప్రభుత్వానికి ఏపీజీఈఎఫ్‌ చైర్మన్‌ కాకర్ల వెంకటరామిరెడ్డి హెచ్చరిక

సాక్షి, అమరావతి: రాష్ట్ర శాసన వ్యవస్థలో అర్హత­లేకుండా అసెంబ్లీ సెక్రటరీ జనరల్‌గా నియమితు­లైన సూర్యదేవర ప్రసన్నకుమార్‌ను వెంటనే పదవి నుంచి తొలగించాలని ఏపీ ప్రభుత్వో­ద్యోగుల సమాఖ్య చైర్మన్‌ కాకర్ల వెంకటరామిరెడ్డి డిమాండ్‌ చేశారు. సెక్షన్‌ ఆఫీసర్‌ (ఎస్‌వో) కంటే తక్కువ కే­డర్‌ వ్యక్తిని తీసుకొచ్చి అసెంబ్లీలో అత్యున్నత పదవిని కట్టబె­ట్టడమే కాక ఏకంగా ప్రభుత్వ ప్రధా­న కార్యదర్శి (సీఎస్‌) స్థాయి హోదాను కల్పించడం చంద్రబాబు ప్రభుత్వ దిగజారుడు రాజకీ­యానికి నిదర్శనమ­న్నా­రు. వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో గురు­వారం ఆయన మీడి­యాతో మాట్లాడు­తూ.. తె­ల­ంగాణకు చెందిన ప్రస­న్న­కుమార్‌ను ఏపీ అసెంబ్లీ సెక్ర­టరీ జనరల్‌గా తప్పు­డు పద్ధతిలో నియమించా­రని చెప్పారు. కాకర్ల  ఏమన్నారంటే..

2024 ఆగస్టులో అసెంబ్లీ సెక్రటరీ జనరల్‌గా సూర్యదేవర ప్రసన్నకుమార్‌ను ప్రభుత్వం నియ­మించింది. అందులో ప్రసన్న­కుమార్‌ సుప్రీంకోర్టు మాజీ రిజిస్ట్రార్‌ జనరల్‌గా పేర్కొంది. కానీ, సుప్రీంకోర్టు రిజిస్ట్రార్‌గా ప్రసన్న­కుమార్‌ నియామకం చెల్లదని అన్ని మీడియాల్లో వచ్చింది. సుప్రీంకోర్టు అతని డెçప్యుటేషన్‌ నియా­మకాన్ని రద్దుచేసి ఆయన మాతృసంస్థ ప్రసార భారతికి తిరిగి పంపించింది. ఈ విషయాన్ని ప్రభుత్వం గుర్తించలేదు.

చట్టసభల్లో పనిచేసిన అనుభవమే లేదు..
లోక్‌సభ/రాజ్యసభలో లేదా ఇతర రాష్ట్రాల అసెంబ్లీల్లో సెక్రటరీ జనరల్‌గా పని­చేసిన వారిని మాత్రమే అసెంబ్లీ సెక్రటరీ జనర­ల్‌గా నియమించాలి. కానీ, ప్రసన్నకుమార్‌కు ఎక్కడా ఈ అనుభవంలేదు. మరి అలాంటి వ్యక్తిని ఎలా నియమించారు? కనీసం విద్యార్హతలైనా ప్రభు­­త్వం చూసిందా? అసెంబ్లీ సర్వీసు నిబంధనల ప్రకారం అసెంబ్లీలో ఉప కార్యదర్శి, ఆపై పోస్టుల్లో వ్యక్తులు తప్పనిసరిగా న్యాయ విద్యలో డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. ప్రసన్నకుమార్‌కు ఆ అర్హత ఉందో లేదో ఎవరికీ తెలీదు. దీనిపై సమాచార హక్కు చట్టం కింద సమాచారం అడిగితే దాటవే­శారు. 

ప్రసన్నకు­మార్‌కు చంద్రబాబు ప్రభుత్వం అసెంబ్లీ సెక్రటరీ జనరల్‌ పోస్టు కట్టబెట్టి అసెంబ్లీ శాశ్వత ఉద్యోగులను నిలువునా ముంచేసింది. వాస్తవానికి.. ప్రసన్నకుమార్‌ ప్రసార భారతిలో న్యూస్‌ రీడర్‌–ట్రాన్స్‌లేటర్‌గా మాత్రమే పనిచే­శారు. ఇది రాష్ట్ర అసెంబ్లీలో సెక్షన్‌ ఆఫీసర్‌ కంటే కిందస్థాయి పోస్టు. ఇక సచివాలయ ఉద్యోగులు పదోన్నతులు అడిగితే.. మీరు సరిగ్గా పనిచేయరు, నేను బయటి వ్యక్తులను తెచ్చుకుని పనిచేసుకుంటానని ప్రసన్నకుమార్‌ బెదిరిస్తున్నారు.  

దుర్బుద్ధితో ప్రసన్నకుమార్‌ నాటకం..
ప్రస్తుతం అసెంబ్లీ సీనియర్‌ ఉద్యోగుల్లో జాయింట్‌ డైరెక్టర్‌ విజయరాజు పదోన్నతులకు   ముందువ­రు­సలో ఉన్నారు. ఆయనకు పదోన్నతి లభి­స్తే అడిష­నల్‌ సెక్రటరీ, ఆ తర్వాత సెక్రటరీ హో­దా వస్తుంది. కానీ, తప్పుడు ఆరోపణలతో విజ­­యరాజును స­స్పెండ్‌ చేశారు. ఆ తర్వాత మళ్లీ సర్వీసులోకి తీ­సు­కున్న సమయంలో ప్రభుత్వం ‘పెండింగ్‌ ఎంక్వైరీ’ వేసింది. 

కానీ, ఏడాది నుంచి విచారణ క­మిటీని నియమించకుండా.. తప్పు జరి­గిందో లేదో తేల్చకుండా తాత్సారం చేస్తు­న్నా­రు. విచారణ జరి­పితే విజయరాజు తప్పులేదని తేల­డమే కాక అ­ప్పుడు ఆయనకు పదోన్నతి కల్పించా­ల్సి వస్తుంది. ఇదే జరిగితే తన పోస్టును కోల్పో­తాననే దుర్బు­ద్ధితో ప్రసన్నకుమార్‌ నాటకం అడుతున్నారన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement