తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో ఐదవ రోజైన బుధవారం (మే 27) ఉదయంశ్రీ గోవిందరాజస్వామివారు పల్లకిపై మోహినీ అవతారంలో విహరించి భక్తులను కటాక్షించారు.
చెక్కభజనలు, కోలాటాలు, మంగళవాయిద్యాల నడుమ పల్లకీ ఉత్సవం భక్తి పారవశ్యంతో సాగింది.
గోవింద నామస్మరణలతో మారుమోగిన మాడవీధుల్లో భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారి దివ్య మంగళ రూపాన్ని దర్శించుకున్నారు.


