కడలి కెరటాలకు యువకుడి బలి

Young Man Missing In Kothapatnam Beach Waters - Sakshi

సాక్షి, కొత్తపట్నం: కడలి కెరటాలకు యువకుడు బలయ్యాడు. ఈ సంఘటన మండలంలోని కె.పల్లెపాలెం బీచ్‌లో ఆదివారం జరిగింది. పోలీసులు కథనం ప్రకారం.. ఒంగోలు నగరం శ్రీనగర్‌ కాలనీకి చెందిన గోదా మధుసూదన్‌రెడ్డి (25) స్నేహితులతో కలిసి సముద్ర స్నానానికి వచ్చాడు. అతడి స్నేహితులు సముద్రం ఒడ్డున కొద్దిసేపు కబడ్డీ ఆడారు. మధుసూదన్‌రెడ్డి ఒక్కడే సముద్ర స్నానం చేస్తున్నాడు.

ఒక్క సారిగా అలలు ఉధృతంగా రావడంతో గల్లంతయ్యాడు. అతడిని మిత్రులు కాపాడే ప్రయత్నం చేసినా ఆచూకీ లభించలేదు. సాయంత్రానికి శవమై బయటకు కొట్టుకొచ్చాడు. మిత్రులు మధుసూదన్‌రెడ్డి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వారు హుటాహుటిన బీచ్‌కు తరలి వచ్చారు. చేతికొచ్చిన కుమారుడు నిర్జీవంగా ఉండటాన్ని చూసి తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. ఎస్‌ఐ ఎం.శ్రీనివాసరావు తన సిబ్బందితో తీరానికి వచ్చి వివరాలు సేకరించారు. తండ్రి మాలకొండారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రిమ్స్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top