పొందూరు: రాపాక పంచాయతీ పరిధిలోని ఇల్లయ్యగారిపేట సమీపంలో నిర్వహిస్తున్న క్వారీలో ఓ వ్యక్తి మృత్యువాత పడ్డాడు. క్వారీలో పని చేస్తుండగా కొండపై నుంచి కాలు జారి పడిపోవడంతో ఇల్లయ్యగారిపేటకు చెందిన కొంచాడ శ్రీను(28) అనే వ్యక్తి చనిపోయినట్టు గ్రామస్తులు తెలిపారు. ఎస్సై కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లీజుదారులు, క్వారీ మేస్త్రీలు తగు జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఈ ప్రమాదం సంభవించింది. కొండపైకి ఎక్కి పెద్ద రాళ్లను తోయడం, మట్టిని తీస్తున్నప్పుడైన ఈ ప్రమాదం సంభవించి ఉండవచ్చునని స్థానికులు అనుమానిస్తున్నారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలముకొన్నాయి.
అనాథలైన భార్య, పిల్లలు
శ్రీనుకు భార్య వరలక్ష్మి, ఇద్దరు చంటి పిల్లలు సురేంద్ర (2 సంవత్సరాలు), వాసు( నెల రోజులు) ఉన్నారు. తల్లి లక్ష్మీనారాయణ, తండ్రి చిన్నప్పన్న వృద్ధులు. ఆ కుటుంబమంతా రాయిపని చేసుకొనే జీవనం సాగిస్తున్నారు. శ్రీను మృతితో భార్య బిడ్డలు, తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు.
క్వారీ వద్ద కార్మికుడి మృతి
Published Sun, Jun 14 2015 1:15 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement