వడ్డీ వ్యాపారుల వేధింపులు: మహిళ మృతి | women died due financiers harassments | Sakshi
Sakshi News home page

వడ్డీ వ్యాపారుల వేధింపులు: మహిళ మృతి

Dec 17 2015 10:58 AM | Updated on Oct 2 2018 4:31 PM

వైఎస్సార్ జిల్లా కడప పట్టణంలో వడ్డీ వ్యాపారుల వేధింపులకు ఓ మహిళ బలైంది.

కడప: వైఎస్సార్ జిల్లా కడప పట్టణంలో వడ్డీ వ్యాపారుల వేధింపులకు ఓ మహిళ బలైంది. వివరాలు  స్ధానిక ఎర్రబడి అగాడివీధికి చెందిన వహీదాబాను(53) అవసరాల కోసం రూ.1.5 లక్షలు అప్పు చేసింది. క్రమం తప్పకుండా వడ్డీ చెల్లించేది. అయితే వడ్డీవ్యాపారులు వహీదాను బెదిరించి ఆమె పేరుతో ఉన్న 5 సెంట్ల స్థలాన్ని బలవంతంగా రిజిష్ట్రేషన్ చేయించు కున్నారు. నాలుగు రోజుల క్రితం వడ్డీ వ్యాపారులు ఇల్లు ఖాళీ చేయమని బెదిరించి వెళ్లారు.
 
ఈ క్రమంలో బుధవారం రాత్రి కూడా వడ్డీవ్యాపారుల మనుషులు బెదిరించడంతో మనస్థాపానికి గురై వహీదా చనిపోయినట్టు మృతురాలి సోదరుడు మహమూద్ విలేకరులకు తెలిపాడు. గతంలో ఆ స్థలం విషయమై పోలీసు పంచాయతీ కూడా జరిగిందని, వడ్డీవ్యాపారులు బలవంతంగా బెదిరించి స్థలాన్ని రాయించుకున్నారని పేర్కొన్నాడు. వడ్డీ వ్యాపారులపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు మహమూద్ చెప్పాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement