పెంటపాడు : గతేడాది డిసెంబర్లో ప్రత్తిపాడు రైల్వేట్రాక్పై మృతి చెందిన మహిళది హత్య అని పెంటపాడు పోలీసులు తేల్చారు. నిందితులను మంగళవారం అరెస్టు చేసి, తాడేపల్లిగూడెం కోర్టుకు తరలించారు. ఈ వివరాలను సీఐ మధుబాబు పెంటపాడు పోలీసుస్టేషన్ వద్ద విలేకరులకు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. గత డిసెంబర్లో ప్రత్తిపాడు రైల్వేట్రాక్పై కామరాపు పూర్ణచంద్రిక (23) మృతదేహం లభ్యమైంది. అప్పట్లో తాడేపల్లిగూడెం రైల్వేపోలీసులు ఆమెది అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.
ఆమె పుట్టిల్లు పాలకోడేరు మండలం గొల్లలకోడేరు కాగా.. అత్తవారిల్లు పెదవేగి మండలం కొప్పాక. కొప్పాకకు చెందిన దుర్గారావుతో ఆమెకు 2008లో పెళ్లైంది. పూర్ణచంద్రిక మృతి సమయంలో ఆమె తండ్రి పతివాడ పెదపైడియ్య తన కుమార్తె ప్రమాదవశాత్తూ చనిపోలేదని, భర్తే హత్యచేసి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశారు. అతనికి వివాహేతర సంబంధం ఉందని తాడేపల్లిగూడెం రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని గూడెం రైల్వేపోలీసులు జిల్లా రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు.
అక్కడినుంచి జిల్లా ఎస్పీ కార్యాలయానికి వచ్చిన సమాచారంతో ఎస్పీ ఆదేశాల మేరకు హత్యకేసుగా నమోదు చేసిన పెంటపాడు పోలీసులు డీఎస్పీ నర్రా వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం రూరల్ సీఐ మధుభాబు, పెంటపాడు ఎస్సై కె.గుర్రయ్య నేతృత్వంలో దర్యాప్తు చేపట్టారు. పూర్ణచంద్రిక హత్యకు భర్త దుర్గారావు, అతని బంధువులే కారణమని తేల్చారు. పూర్ణచంద్రికకు పురుగుల మందు తాగించి ఆపై చీరతో ఉరివేసి హత్య చేశారని, ఆ తర్వాత ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రత్తిపాడు బ్రిడ్జి వద్ద కింద ఉన్న పట్టాలపై మృతదేహాన్ని పడవేశారని గుర్తించారు.
దీంతో మృతురాలి భర్త దుర్గారావుతోపాటు పూళ్లగ్రామానికి చెందిన దుర్గారావు పిన్ని కుమారుడు అల్లురవి, ఆటో డ్రైవర్ రౌతు సింహాద్రిని అరెస్టుచేసి మంగళవారం కోర్టుకు పంపినట్లు సీఐ మధుబాబు తెలిపారు. ఈ హత్యతో సంబంధం ఉన్న దుర్గారావు చెల్లెలు రాజేశ్వరి పరారీలో ఉందని ఆమెను కూడా త్వరలో అరెస్ట్చేస్తామని సీఐ వెల్లడించారు. ఈ హత్యకేసు మిస్టరీని ఛేదించేందుకు సహకరించిన పెంటపాడు ఎస్సై కె.గుర్రయ్య, హెచ్సీలు సాంబశివరావు, ఎస్.ఎన్.భూషణం, కానిస్టేబుల్ గంగాధర్ను సీఐ ప్రత్యేకంగా అభినందించారు.
మహిళ హత్యకేసును ఛేదించిన పోలీసులు
Published Wed, Mar 16 2016 12:33 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బీజేపీలో చేరిన రాధికా ఖేరా.. ఎవరీమె?
కేజ్రీవాల్ కస్టడీ పొడిగింపు.. బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా
బీజేపీపై డింపుల్ యాదవ్ కీలక వ్యాఖ్యలు: పదేళ్లలో..
ఆవిడ ఉత్తరం రాస్తే అధికారులను మార్చేస్తారా..!
డీప్ఫేక్ టెక్నాలజీకోసం ఇంటెల్తో జతకట్టనున్న ప్రముఖ కంపెనీ
ఇచ్చాపురంలో సీఎం జగన్ రోడ్ షో, జనసంద్రంగా మారిన ప్రధాన రహదారి (ఫోటోలు)
Rashmi Gautam: విదేశాల్లో ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్న రష్మి (ఫోటోలు)
ప్రచారంలో మహిళలతో కలిసి డాన్స్ చేసిన వంశీ భార్య
కూల్ లుక్తో కేక పుట్టిస్తున్న బాలీవుడ్ బ్యూటీ హీనా ఖాన్ (ఫొటోలు)
T20 World Cup 2024: చరిత్ర సృష్టించనున్న రోహిత్ శర్మ
తప్పక చదవండి
- Rekha Jhunjhunwala: ఒక్కరోజులోనే రూ.800 కోట్ల నష్టం
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నారా? హార్దిక్ సమాధానం ఇదే!
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- వారందరి జీవితాలను మార్చేసిన 'ఆర్య'కు 20 ఏళ్లు
- వైజాగ్ మాల్యా.. వంశీ!
- LS Elections 3rd Phase: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్
Advertisement