రైల్లో మహిళ మృతి | Woman dies from heart attack in Train | Sakshi
Sakshi News home page

రైల్లో మహిళ మృతి

Aug 24 2015 4:39 PM | Updated on Sep 3 2017 8:03 AM

రైల్లో ప్రయాణిస్తున్న మహిళ గుండెపోటుతో మృతిచెందింది. ఈ సంఘటన గుంటూరు జిల్లా రేపల్లె మండలం పల్లెకోనలో సోమవారం జరిగింది.

రేపల్లె (గుంటూరు) : రైల్లో ప్రయాణిస్తున్న మహిళ గుండెపోటుతో మృతిచెందింది. ఈ సంఘటన గుంటూరు జిల్లా రేపల్లె మండలం పల్లెకోనలో సోమవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. కృష్ణా జిల్లా శివరామపురం గ్రామానికి చెందిన రావి శివనాగేంద్రం(48) రైల్లో తెనాలి నుంచి రేపల్లె వెళ్తున్నారు.

కాగా ప్రయాణిస్తున్న సమయంలో గుండెపోటు రావడంతో ఆమె ఒక్కసారిగా కుప్పకూలిపోయి అక్కడికక్కడే మృతిచెందింది. ఇది గమనించిన తోటి ప్రయాణికులు రైల్వే సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement