పసి కందుని చంపి తల్లి ఆత్మహత్య | woman commits suicide | Sakshi
Sakshi News home page

పసి కందుని చంపి తల్లి ఆత్మహత్య

Jul 23 2017 9:48 AM | Updated on Nov 6 2018 8:08 PM

పసి కందుని చంపి తల్లి ఆత్మహత్య - Sakshi

పసి కందుని చంపి తల్లి ఆత్మహత్య

కడుపున పుట్టిన ఆరు నెలల పాపను నీటితొట్టిలో వేసి మృతి చెందగానే తల్లి ఆత్మహత్యకు పాల్పడింది.

► కుటుంబ కలహాలు తాళలేక ఉరిపోసుకొని మృతి 
► కూతుర్ని నీటి తొట్టిలో పడవేసిన తల్లి
 
వినుకొండ రూరల్‌: కడుపున పుట్టిన ఆరు నెలల పాపను నీటితొట్టిలో వేసి మృతి చెందగానే తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన మండలంలోని గోకనకొండ గ్రామంలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలను పరిశీలిస్తే గ్రామానికి చెందిన కొండి అంకారావుతో వరలక్ష్మి(22)కి 2016లో వివాహమైంది. అంకారావు తన తల్లిదండ్రులు అక్కన్న, రామాంజమ్మతో కలిసి ఉమ్మడి కుటుంబంగా జీవిస్తున్నారు. వరలక్ష్మికి పెళ్లయిన తొలినాళ్ల నుంచి అత్తమామల పోడుతోపాటు భర్త వేధింపులతో విసిగిపోయింది.

చివరకు శనివారం ఇంట్లో కుటుంబ కలహాల నేపథ్యంలో ఆరు నెలల పసికందును నీటి తొట్టిలో పడవేసి ఆమె ఇంట్లో తలుపులు వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. వరలక్ష్మి తల్లిదండ్రులు గండికోట చినవెంకట నారాయణ, కోటేశ్వరమ్మ కూతురితోపాటు మనువరాలు చనిపోయిందన్న తెలియడంతో కన్నీరు మున్నీరుగా విలపించారు. ఇద్దరి మృతిపై ఎస్సై శ్రీనివాసరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు వచ్చారన్న సమాచారంతో భర్త అంకారావు, అత్తమామలు అక్కన్న, రామాంజమ్మ పరారయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement