మద్యం దుకాణంలో చోరీ | wine shop theft in guntur district | Sakshi
Sakshi News home page

మద్యం దుకాణంలో చోరీ

Nov 9 2015 12:22 PM | Updated on Aug 24 2018 2:36 PM

మద్యం దుకాణంలో దొంగలు పడి రూ. 2 లక్షలు దోచుకెళ్లారు.

గుంటూరు: మద్యం దుకాణంలో దొంగలు పడి రూ. 2 లక్షలు దోచుకెళ్లారు. ఈ సంఘటన గుంటూరు జిల్లా నకిరేకల్లులో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది.

సోమవారం ఉదయం చోరీ జరిగిందని గుర్తించిన వైన్స్ వ్యాపారి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. వేసిన తాళాలు వేసేనట్లే ఉన్నా దొంగతనం ఎలా జరిగిందన్న దానిపై పోలీసులు దృష్టి సారించారు. వైన్స్‌లో పని చేసే సిబ్బందే ఈ పనిచేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement