'వేసవిలో దాహార్తిని తీర్చేందుకు కృషి చేస్తా' | We solve water scarcity in prakasam district, YV SubbaReddy | Sakshi
Sakshi News home page

'వేసవిలో దాహార్తిని తీర్చేందుకు కృషి చేస్తా'

Mar 27 2015 2:38 PM | Updated on May 28 2018 1:52 PM

ప్రకాశం జిల్లాలో తాగునీరు సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ప్రకాశం జిల్లా ఒంగోలు ఎంపీ, వైఎస్ఆర్ సీపీ నాయకుడు వైవీ సుబ్బారెడ్డి జిల్లా ప్రజలకు హామీ ఇచ్చారు.

ఒంగోలు: ప్రకాశం జిల్లాలో తాగునీరు సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ప్రకాశం జిల్లా ఒంగోలు ఎంపీ, వైఎస్ఆర్ సీపీ నాయకుడు వైవీ సుబ్బారెడ్డి జిల్లా ప్రజలకు హామీ ఇచ్చారు. అందులోభాగంగా వేసవిలో దాహార్తిని తీర్చేందుకు కృషి చేస్తానని చెప్పారు.

తాగునీటి సమస్య పరిష్కారం కోసం అవసరమైతే ప్రభుత్వం, ఉన్నతాధికారులపైనా ఒత్తిడి తీసుకువస్తానని తెలిపారు. శుక్రవారం జిల్లాలోని పొన్నలూరు మండలం సుంకిరెడ్డిపాలెంలో ఆర్వో వాటర్ ప్లాంట్కు ఆయన శంకుస్థాపన చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement