రాయల తెలంగాణకు ఒప్పుకోం: బీజేపీ | we are against to rayala telangana, says bjp | Sakshi
Sakshi News home page

రాయల తెలంగాణకు ఒప్పుకోం: బీజేపీ

Nov 26 2013 12:30 AM | Updated on Mar 29 2019 9:18 PM

రాయల తెలంగాణ తమకు సమ్మతం కాదని బీజేపీ స్పష్టం చేసింది. తమ పార్టీ నిర్ణయంలో ఎటువంటి మార్పూ లేదని పునరుద్ఘాటించింది.

సాక్షి, హైదరాబాద్:  రాయల తెలంగాణ తమకు సమ్మతం కాదని బీజేపీ స్పష్టం చేసింది. తమ పార్టీ నిర్ణయంలో ఎటువంటి మార్పూ లేదని పునరుద్ఘాటించింది. గుజ రాత్‌లో నిర్మించనున్న సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ విగ్రహ ఏర్పాట్లపై సోమవారం ఇక్కడ వర్క్‌షాప్ జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి గుజ రాత్ న్యాయశాఖ మంత్రి ప్రదీప్ సింగ్ జడేజా, పార్టీ నేతలు డాక్టర్ కె.లక్ష్మణ్, సీహెచ్ విద్యాసాగరరావు, డాక్టర్ మల్లారెడ్డితో కలసి మీడియాతో మాట్లాడారు. రాయల తెలంగాణపై తమకు ఏ అధికారీ ఫోన్ చేయలేదని, ఈ అంశంలో తమ వైఖరి మారబోదని అన్నారు.

జీవోఎంకు ఇచ్చిన లేఖకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. హైదరాబా ద్ రాజధానిగా పది జిల్లాలతో కూడిన తెలంగాణ మాత్రమే కోరుకుంటున్నామన్నా రు. గుజరాత్‌లో నిర్మించనున్న సమైక్యతా చిహ్నం- సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ విగ్రహంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పెద్దఎత్తున కార్యక్రమాలు చేపట్టినట్లు ఆ రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ప్రదీప్ సింగ్ జడేజా చెప్పారు. గుజరాత్‌లో పని చేస్తున్న తెలుగు ఐఎఎస్, ఐపీఎస్‌లు ఈనెల 29 నుంచి మూడు రోజుల పాటు హైదరాబాద్, వైజాగ్, తిరుపతిలో పర్యటించి అవగాహన సదస్సుల్లో పాల్గొంటారన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement