విజయనగరం: ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ | Vizianagaram: Namination Withdraw Process Is Completed | Sakshi
Sakshi News home page

విజయనగరం: ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ

Mar 29 2019 10:21 AM | Updated on Mar 29 2019 10:22 AM

Vizianagaram: Namination Withdraw Process Is Completed  - Sakshi

సాక్షి, విజయనగరం రూరల్‌: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల దాఖలు, పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియ గురువారంతో ముగిసింది. విజయనగరం అసెంబ్లీ స్థానానికి నామినేషన్ల ప్రక్రియ ఈ నెల 18న ప్రారంభం కాగా జాతీయ పార్టీలతో పాటు గుర్తింపు పొందిన ప్రాంతీయ పార్టీలు, స్వతంత్రులు 11 మంది నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ గురువారం ఆఖరిరోజు కావడంతో బుధవారం ఇద్దరు అభ్యర్థులు తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. మిగితా 9 మంది నామినేషన్ల ప్రక్రియ ముగిసిన నాటికి నామినేషన్లు ఉపసంహరించుకోనందున బరిలో తొమ్మిది మంది నిలిచారని నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, జాయింట్‌ కలెక్టర్‌ కె.వెంకటరమణారెడ్డి తెలిపారు. అభ్యర్థుల పేర్లు, వారికి కేటాయించిన ఎన్నికల గుర్తులతో ఎన్నికల సంఘానికి పంపినట్టు తెలిపారు.  

వ.సం. అభ్యర్థులు          పార్టీ      గుర్తు
1  కోలగట్ల వీరభద్రస్వామి    వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ      ఫ్యాన్‌

2

పి.అదితి విజయలక్ష్మి గజపతిరాజు   టీడీపీ              సైకిల్‌
3 సతీష్‌కుమార్‌ సుంకరి    భారత జాతీయ కాంగ్రెస్‌         హస్తం
4 సుబ్బారావు కుసుమంచి  భారతీయ జనతా పార్టీ         కమలం
5  చోడి ఆదినారాయణ  జన జాగృతి పార్టీ         మైక్‌
6 పాలవలస యశస్వి                  జనసేన    గాజుటంబ్లర్‌
7 రేజేటి స్వర్ణలత      ఇండియా ప్రజాబంధు పార్టీ      బాకా
8 మండపాక అప్పలరాము   లోక్‌ జనశక్తి పార్టీ  కంప్యూటర్‌
9 భీశెట్టి అప్పారావు బాబ్జీ  ఇండిపెండెంట్‌       విజిల్‌ 

                                               
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement