చేపలు, రొయ్యల ఉత్పత్తిలో దేశంలోనే ఏపీ మొదటిస్థానంలో ఉందని వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు.
హైదరాబాద్: చేపలు, రొయ్యల ఉత్పత్తిలో దేశంలోనే ఏపీ మొదటిస్థానంలో ఉందని వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. ఏపీ శాసనసభలో వ్యవసాయ బడ్జెట్ ను శుక్రవారం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... మత్య్య పరిశ్రమను వృద్ధికారకంగా గుర్తించామన్నారు.
చేపల ఉత్పత్తికి అనేక పథకాలు ప్రవేశపెడుతున్నట్టు చెప్పారు. విజయవాడను ప్రపంచ ఆక్వా కల్చర్ రాజధానిగా చేస్తామని హామీయిచ్చారు. మత్య్సకారుల కోసం అనేక పథకాలు ప్రవేశపెడతామన్నారు. బడ్జెట్ లో మత్స్యశాఖకు రూ.187 కోట్లు కేటాయించారు.