ఈ ఏడాది ‘తూర్పు’ ముంగిట రుతురాగం సరిగా పల్లవించలేదు. సరైన వర్షాలు కురిపించకుండానే నైరుతి రుతుపవనాలు ముఖం చాటేయగా.. ఈశాన్య రుతుపవనాలు కూడా అదే బాటలో పయనిస్తున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే ఖరీఫ్లో ఇక్కట్ల పాలైన రైతులు.. రబీలో కూడా అదే పరిస్థితిని ఎదుర్కోనున్నారు.
* ‘తూర్పు’ను కరుణించని వరుణుడు
* దయచూపని నైరుతి..
* ఈశాన్య రుతుపవనాలదీ అదే గతి!
* ఇప్పటివరకూ 38.2 శాతం తక్కువగా వర్షపాతం
* అడుగంటుతున్న భూగర్భ జలాలు
* బోర్ల కింద రబీ సాగుకు ఇబ్బందులు
అమలాపురం : అక్టోబర్, నవంబర్ నెలల్లో ఈశాన్య రుతుపవనాలు.. దానివెంట వచ్చే వాయుగుండాలు, తుపాన్లతో భారీ వర్షాలు కురిసి, ఖరీఫ్ పంట నీట మునిగి, రైతు నష్టపోవడం జిల్లాలో సర్వసాధారణంగా మారింది. అయితే ఈ ఏడాది ఆ పరిస్థితి లేదు. పోనీ అలాగని ఖరీఫ్ దక్కిందనడానికీ లేదు. సరైన వర్షాలు లేక వరిపై తెగుళ్లు విజృంభించి రైతును ముంచేశాయి. ఈ ఏడాది జిల్లాలో ఇప్పటివరకూ 38.2 శాతం తక్కువగా వర్షపాతం నమోదైంది. ఈ ఏడాది ఇప్పటివరకూ మొత్తం 983.9 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, కేవలం 608.1 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది.
ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించే అక్టోబర్ నెలలో సగటు 214.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, 109.4 మిల్లీమీటర్లు (49 శాతం తక్కువ) నమోదైంది. నవంబర్ ఆరు వరకూ 18.6 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా ఇప్పటివరకూ సున్నా శాతం నమోదైంది. బంగాళాఖాతంలో వాయుగుండం వల్ల రెండు రోజులుగా చెదురుమదురు జల్లులు పడుతున్నా పెద్దగా ఉపయోగం లేదు. ఈ రెండు నెలల్లో కూడా చెప్పుకోదగ్గ వర్షం లేకపోవడం రైతులను ఆందోళన గురి చేస్తోంది. డెల్టా, మెట్ట ప్రాంతాల్లో వరి చేలు కోతలకు సిద్ధంగా ఉన్న ఈ సమయంలో వానలు పడకూడదని రైతులు సాధారణంగా కోరుకుంటారు. అయితే అసలు దుక్కు వర్షం కూడా పడకపోవడం వారిని కలవరపెడుతోంది.
ఇక్కడ మరీ దారుణం
కొన్ని మండలాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. దేవీపట్నంలో 61 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. తాళ్లరేవు 59.1, ప్రత్తిపాడు 58.3, బిక్కవోలు 55.5, గండేపల్లి 54.1, కరప 53.1, అయినవిల్లి 51.4, సామర్లకోట 48, కాకినాడ రూరల్ 47.4, రాయవరం 46.3, కె.గంగవరం 45.5, సీతానగరం 45.4, మండపేట 45.2, ఆలమూరు 45.1, అనపర్తి 42.5, కొత్తపల్లి 42.4, పెదపూడిలో 40.8 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. మిగిలిన మండలాల్లో కూడా ఇంచుమించు ఇదే పరిస్థితి నెలకొంది.
అడుగంటిన భూగర్భ జలాలు
వర్షపాతం తగ్గిపోవడంతో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. డెల్టాలో సగటున ఐదడుగులు, మెట్ట, ఏజెన్సీల్లో ఏడు నుంచి తొమ్మిదడుగుల మేర భూగర్భ జలాలు పడిపోయాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనివల్ల వచ్చే రబీలో బోర్ల కింద సాగు చేసే రైతులు నీటి కోసం అల్లాడే పరిస్థితి ఏర్పడనుంది. ముఖ్యంగా మెట్ట, ఏజెన్సీ ప్రాంతాల్లో బోర్లపై ఆధారపడి సాగు చేయడం ఇబ్బందేనని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు.
ఈ ప్రాంతంలో ఆరుతడి పంటలు సాగు చేసేలా రైతులను ప్రోత్సహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అలాగే వచ్చే రబీకి గోదావరిలో నీటి ఎద్దడి ఏర్పడనున్న దృష్ట్యా తూర్పు డెల్టాలో రైతులు సాగునీటి అవసరాలకు చాలావరకూ బోర్లపైనే ఆధారపడతారు. డెల్టాలో మోటార్లపై కొబ్బరి, వాణిజ్య పంటలు సాగు చేసే రైతులకు సైతం నీటి ఇక్కట్లు తప్పకపోవచ్చు.
గతి తప్పిన రుతురాగం
Published Tue, Nov 11 2014 1:10 AM
Advertisement
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- ఐసీఎంఆర్ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు ఇవే..
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement