వరంగల్ డీఐజీ ఎదుట ఇద్దరు మావోల లొంగుబాటు | Two Maoists surrender in Warangal | Sakshi
Sakshi News home page

వరంగల్ డీఐజీ ఎదుట ఇద్దరు మావోల లొంగుబాటు

Aug 24 2013 2:37 PM | Updated on Oct 9 2018 2:51 PM

ఆనారోగ్యం కారణంగా ఛత్తీస్గఢ్కు చెందిన ఇద్దరు మావోయిస్టులు ఈ రోజు తమ ఎదుట లొంగిపోయారని వరంగల్ రేంజ్ డీఐజీ ఎం.కాంతారావు శనివారం ఇక్కడ వెల్లడించారు.

ఆనారోగ్యం కారణంగా ఛత్తీస్గఢ్కు చెందిన ఇద్దరు మావోయిస్టులు ఈ రోజు తమ ఎదుట లొంగిపోయారని వరంగల్ రేంజ్ డీఐజీ ఎం.కాంతారావు శనివారం ఇక్కడ వెల్లడించారు. సుకుమా జిల్లాకు చెందిన దులారాం అలియాస్ యోగేశ్ పశ్చిమ బస్తార్ డివిజన్లో కమిటీ సభ్యునిగా పనిచేస్తున్నారని తెలిపారు. అలాగే కే పూజి అలియాస్ అనిత బీజాపూర్ డివిజన్లో కమిటీ సభ్యురాలుగా పని చేస్తుందని చెప్పారు.

 

యోగేశ్పై దాదాపు 100 కేసులు ఉన్నాయని వాటిలో 13 హత్య కేసులని అన్నారు. అతన్ని పట్టుకుంటే 1.6 లక్షల రివార్డు అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించిందని కాంతారావు చెప్పారు. అలాగే అనితపై 8 కేసు నమోదు ఉన్నాయని తెలిపారు. ఆమె 2001 నుంచి మావోయిస్టు ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహారిస్తుందని అన్నారు. ఆమె తలపై రూ. లక్ష రివార్డును ప్రభుత్వం ప్రకటించిందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement