మద్యానికి బానిసై అతిగా మద్యం తాగడంతో ఇద్దరు మృతి చెందారు.
అతిగా మద్యం సేవించి ఇద్దరి మృతి
Dec 4 2015 1:46 PM | Updated on Sep 3 2017 1:29 PM
గుమ్మగట్ట: మద్యానికి బానిసై అతిగా మద్యం తాగడంతో ఇద్దరు మృతి చెందారు. ఈ సంఘటన అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలం కలుగోడు గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కొండలయ్య(40), తిమ్మప్ప(58) కూలి పనులు చేసుకుంటూ ఉంటారు. శుక్రవారం ఇద్దరు అతిగా మద్యం తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లారు. స్థానికులు గమనించే లోపలే ఇద్దరు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement


