అనంతపురం జిల్లా కదిరి స్టేట్బ్యాంకు ఆఫ్ ఇండియా-వ్యవసాయ అభివృద్ధి బ్యాంకు(ఎస్బీఐ-ఏడీబీ)లో చోటు చేసుకున్న గోల్మాల్ కేసులో బ్యాంకు సిబ్బందిపై పోలీసులు నమోదు చేశారు.
కదిరి: అనంతపురం జిల్లా కదిరి స్టేట్బ్యాంకు ఆఫ్ ఇండియా-వ్యవసాయ అభివృద్ధి బ్యాంకు(ఎస్బీఐ-ఏడీబీ)లో చోటు చేసుకున్న గోల్మాల్ కేసులో బ్యాంకు సిబ్బందిపై పోలీసులు నమోదు చేశారు. అకౌంట్స్ అధికారి ఎంఎస్ జుహా, ఫీల్డ్ ఆఫీసర్ అశోక్కుమార్ రెడ్డిలపై 408, 409, 420, 477A సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.
రైతులకు ప్రభుత్వం మంజూరు చేసిన పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీ సొమ్ము రూ. కోటిపైగా వీరు స్వాహా చేసినట్టు ఆరోపణలు వచ్చాయి.బోగస్ ఖతాలు తెరిచి నిధులు మళ్లించారు. వాటి నుంచి దర్జాగా డ్రా చేసుకున్నారు.