జిల్లాలోని చీరాల- కారంచేడు మధ్య సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న లారీ, బైక్ను ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది
జిల్లాలోని చీరాల కారంచేడు మధ్య సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న లారీ, బైక్ను ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడిక్కడే మృతిచెందారు.
ఎదురుగా వస్తున్న లారీ బైక్ను ఢీకొట్టిన క్రమంలో తప్పించబోయి లారీ అదుపుతప్పి బ్రిడ్జిని ఢీకొట్టింది. దీంతో లారీ డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం.