అక్కాచెల్లెళ్లపై కామాంధుడి అకృత్యం | two girls raped in visakhapatnam | Sakshi
Sakshi News home page

అక్కాచెల్లెళ్లపై కామాంధుడి అకృత్యం

Mar 26 2014 5:05 PM | Updated on Jul 23 2018 8:49 PM

అక్కాచెల్లెళ్లపై కామాంధుడి అకృత్యం - Sakshi

అక్కాచెల్లెళ్లపై కామాంధుడి అకృత్యం

ఇంజినీరింగ్ పూర్తిచేసుకున్న ఓ యువకుడు వికృత రూపమెత్తి మృగాడుగా మారాడు.

విశాఖపట్నం: ఇంజినీరింగ్ పూర్తిచేసుకున్న ఓ యువకుడు వికృత రూపమెత్తి మృగాడుగా మారాడు. తనకు బంధువులైన ఇద్దరు మైనర్ బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అక్కాచెల్లెళ్లైన ఈ బాలికలకు అతను వరుసకు మేనమామ అవుతాడు. న్యూపోర్టు పోలీస్‌స్టేషన్ సీఐ జి. శ్రీనివాస్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి..

పెదగంట్యాడ మండలం ప్రియదర్శినీ కాలనీకి చెందిన సమ్మిడి రాజేష్ (26) బీటెక్ పూర్తిచేసి ఖాళీగా ఉంటున్నాడు. దూరపు బంధువులైన ఒక కుటుంబం రాజేష్ ఇంటి పక్కనే ఉంటోంది. ఆ కుటుంబ యజమాని గల్ఫ్‌లో వెల్డర్‌గా పనిచేస్తుండగా, అతని భార్య తన ముగ్గురు కుమార్తెలతో ప్రియదర్శినీ కాలనీలో ఉంటోంది. పెద్ద కుమార్తె (13)పై రాజేష్ సుమారు నాలుగు నెలలు క్రితం అత్యాచారం చేశాడు. అనంతరం పలుమార్లు అతడు ఆ బాలికపై లైంగిక వాంఛ తీర్చుకున్నాడు. అతని చేష్టలకు భయపడిన ఆ బాలిక అతని వద్దకు వెళ్లడం మానేసింది.

దీంతో ఆ మృగాడి కన్ను బాధితురాలి చెల్లిపై పడింది. ఈమె(10)పై కూడా రాజేష్ లైంగిక వేధింపులకు పాల్పడినట్టు సీఐ తెలిపారు. రాజేష్ వికృత చేష్టాలతో భీతిల్లిన ఆ బాలికలు అతడిని చూస్తే భయంతో వణికిపోతుండటాన్ని తల్లి గమనించింది. పిల్లలను గట్టిగా ప్రశ్నించగా జరిగిన విషయాన్ని తల్లికి చెప్పారు. దీంతో ఆమె సోమవారం రాత్రి న్యూపోర్టు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి మంగళవారం నిందితుణ్ణి అరెస్టు చేశారు. వైద్య పరీక్షల నిమిత్తం బాలికలను కేజీహెచ్‌కు పంపినట్లు సీఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement