కేరళ ఎక్స్ ప్రెస్ నుంచి టీటీఈ తోసివేత, పరిస్థితి విషమం! | TTE attacked on board Kerala Express, critical | Sakshi
Sakshi News home page

కేరళ ఎక్స్ ప్రెస్ నుంచి టీటీఈ తోసివేత, పరిస్థితి విషమం!

Jun 2 2014 10:40 PM | Updated on Sep 2 2017 8:13 AM

కేరళ ఎక్స్ ప్రెస్ లో విధులు నిర్వహిస్తున్న ట్రైన్ టికెట్ కలెక్టర్ (టీసీ)ని గుర్తు తెలియని వ్యక్తులు కిందకు తోసిన ఘటన కరీంనగర్ జిల్లా జమ్మికుంట స్టేషన్ కు సమీపంలోని బిజిగీరి షరీఫ్ స్టేషన్ వద్ద చోటుచేసుకుంది.

వరంగల్: కేరళ ఎక్స్ ప్రెస్ లో విధులు నిర్వహిస్తున్న ట్రైన్ టికెట్ కలెక్టర్ (టీటీఈ) ఉదయ్ కుమార్ ను గుర్తు తెలియని వ్యక్తులు కిందకు తోసిన ఘటన కరీంనగర్ జిల్లా జమ్మికుంట స్టేషన్ కు సమీపంలోని బిజిగీరి షరీఫ్ స్టేషన్ వద్ద చోటుచేసుకుంది. 
 
ట్రాక్ పక్కన పడి ఉన్న టీటీఈని బిజిగీర్ షరీఫ్ గ్రామస్తులు గమనించి.. ఆస్పత్రికి తరళించారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలైన టీసీ పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.
 
టీటీఈ వరంగల్ పట్టణంలోని సుబేదారి కి చెందినట్టు తెలిసింది. టికెట్ అడిగినందుకు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి. ట్రైన్ నుంచి.తోసి వేసారని గవర్నమెంట్ రైల్వే పోలీసులు తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement