గదుల బుకింగ్‌లో కాషన్‌ డిపాజిట్‌ విధానం

TTD Implements Caution Deposit Policy In Online Rooms Booking  - Sakshi

సాక్షి, తిరుపతి: తిరుమలలో గదుల బుకింగ్‌ విధానంతో మార్పులు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవాస్థానం (టీటీడీ) వారు తెలిపారు. అద్దెగదులను ముందస్తుగా బుక్‌ చేసుకునే భక్తులు కాషన్‌ డిపాజిట్‌ చెల్లించే విధానాన్ని అమలులోకి తెసుకువచ్చింది. ఈ నేపథ్యంలో ఎంత మొత్తంలో గదులు బుక్‌ చేసుకుంటే అదనంగా అంతే మొత్తాన్ని ఆన్‌లైన్‌లో చెల్లించాల్సి ఉంటుంది. భక్తులు గదిని ఖాలీ చేసే సమయంలో డిపాజిట్‌ నుతిరిగి ఇవ్వనున్నట్లు టీటీడీ తెలిపింది. ఈ నెలఖరు నాటికి ఆఫ్‌ లైన్‌ బుకింగ్‌ విధానంలోనూ అమలు చేయనున్నట్లు టీటీడీ వెల్లడించారు. కాగా ప్రస్తుత ఆన్‌లైన్‌ బుకింగ్‌ చేసుకునే భక్తులకు కూడా ఇది వర్తిసున్నట్లు టీటీడీ పేర్కొంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top