బోల్తాపడిన సిమెంట్ లారీ: ఏడుగురి మృతి | Truck falls into lake, seven killed | Sakshi
Sakshi News home page

బోల్తాపడిన సిమెంట్ లారీ: ఏడుగురి మృతి

Oct 26 2013 10:44 PM | Updated on Aug 28 2018 7:14 PM

ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించబోయి ఓ లారీ బోల్తా పడిన శనివారం సంభవించింది.

మార్కాపురం: సిమెంట్ లోడుతో వెళుతున్న లారీ చెరువులోకి దూసుకుపోవడంతో  ఏడుగురు మృతి చెందిన ఘటన ప్రకాశం జిల్లాలోని పెద్దవీరాడు మండలంలో శనివారం సంభవించింది.  ఎదురుగా వస్తున్న ఓ ఆటోను తప్పించే క్రమంలో ఈ దర్ఘటన చోటు చేసుకుంది. మాచర్ల నుంచి బెంగుళూరు కు సిమెంట్ లోడుతో వెళుతున్నలారీ  గోబ్బార చెరువులోకి దూసుకుపోయింది. లారీలో పది మంది ప్రయాణిస్తుండగా ఏడుగురు ప్రాణాలు కోల్పాయారు. ఇప్పటివరకూ  చనిపోయిన వారి మృతదేహాలను వెలికితీసామని డీఎస్పీ తెలిపారు. కాగా, ఇంకా ఆచూకీ దొరికని వారి కోసం గాలిస్తున్నామన్నారు.

 

ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు గాయపడ్డారని, వారిని స్థానిక ఆస్పత్రిలో చేర్చి చికత్స అందిస్తున్నామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement