ఆంధ్రప్రదేశ్ లో శాంతి నెలకొనాలి: శరద్ యాదవ్
ఆంధ్రప్రదేశ్ లోని రెండు ప్రాంతాల్లో శాంతి నెలకొనేలా ఓ పరిష్కారం కావాలి జేడీయూ అధినేత శరద్యాదవ్ అన్నారు.
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ లోని రెండు ప్రాంతాల్లో శాంతి నెలకొనేలా ఓ పరిష్కారం కావాలి జేడీయూ అధినేత శరద్యాదవ్ అన్నారు. తెలంగాణ బిల్లుకు మద్దతు ఇవ్వాలని కోరుతూ శరద్యాదవ్ను కేసీఆర్ కోరారు. శరద్ యాదవ్ ను కలిసి తెలంగాణ సమస్యలను కేసీఆర్ వివరించారు. అయితే తెలంగాణ, సీమాంధ్రలో ఉన్న సమస్యలు పరిష్కారం కావాలని కోరుకుంటున్నానని శరద్యాదవ్ అన్నారు.
తెలంగాణ బిల్లకు మద్దతు కూడగట్టేందుకు దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం ఉదయం ఆర్జేడి అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, ఎల్ జేపీ చీఫ్ రామ్ విలాస్ పాశ్వాన్ ను కేసీఆర్ కలిశారు. కేసీఆర్ విజ్క్షప్తికి లాలూ ప్రసాద్ యాదవ్ సానుకూలంగా స్పందించిన తెలిసింది.