స్పెషల్ ట్రైన్కు తప్పిన ప్రమాదం | Trains delayed due to train bogi collapse in ungutooru | Sakshi
Sakshi News home page

స్పెషల్ ట్రైన్కు తప్పిన ప్రమాదం

Jul 25 2015 8:41 AM | Updated on Apr 3 2019 5:51 PM

బోగీ విరిగి పడి పోవటంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు సమీపంలో శనివారం ఉదయం జరిగింది.

పశ్చిమగోదావరి: బోగీ విరిగి పడి పోవటంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు సమీపంలో శనివారం ఉదయం జరిగింది. విజయవాడ నుంచి విశాఖ వెళ్లే స్పెషల్ ప్యాసింజర్ రైలు శనివారం ఉదయం 5 గంటల సమయంలో ఉంగుటూరు సమీపంలో రాగా ఒక బోగీ నిట్టనిలువుగా చీలి పడిపోయింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఒక్కసారిగా పెద్ద శబ్దంతో బోగీ విరిగిపోవటంతో ప్రయాణికులు ఆందోళన చెందారు.

అధికారులు వెంటనే ఏర్పాట్లు చేయకపోవటంతో కొందరు బస్సుల్లో వెళ్లిపోయారు. అయితే, అధికారులు కొద్దిసేపటి తర్వాత వచ్చిన సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌లో మిగిలిన ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరేలా ఏర్పాట్లు చేశారు. విరిగిపడిన బోగీని పక్కకు తొలిగించి ఉదయం 7.30 గంటలకు రైళ్ల రాకపోకలకు వీలు కల్పించారు. ఈ ఘటన కారణంగా ఆ మార్గంలో రెండు గంటలపాటు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement