ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు - రాకపోకలు బంద్ | traffic shutdown due to heavy rains | Sakshi
Sakshi News home page

ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు - రాకపోకలు బంద్

Published Tue, Nov 10 2015 2:33 PM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM

రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల నెల్లూరు జిల్లాలో వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.

రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల నెల్లూరు జిల్లాలో వాగులు వంకలు  ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. జిల్లాలోని సైదాపురం మండల శివారులోని రెండు ఏర్లు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ఆ మార్గాల్లో మంగళవారం ఉదయం నుంచి రాకపోకలు స్తంభించాయి. సైదాపురం-గూడూరు మధ్య ఉన్న కమాన్‌గెనివాగు పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తుండడంతో ఈ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే సైదాపురం- మార్కాపురం మార్గంలోని మాలేరు వాగు పొంగడంతో ఈ మార్గాంలో కూడా రాకపోకలకు అంతరాయం కలిగింది. సైదాపురంలో సోమవారం సాయంత్రం నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement