నేడు పవన్, వామపక్ష నేతల పాదయాత్ర | Today Pawan and the Left leaders' padayatra | Sakshi
Sakshi News home page

నేడు పవన్, వామపక్ష నేతల పాదయాత్ర

Apr 6 2018 2:59 AM | Updated on Mar 23 2019 9:10 PM

సాక్షి, అమరావతి: రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో నమ్మక ద్రోహానికి పాల్పడిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా శుక్రవారం విజయవాడలోని బెంజి సర్కిల్‌ నుంచి పాదయాత్ర ప్రారంభించనున్నట్లు జనసేన పార్టీ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది.

జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్, సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు పి.మధు, రామకృష్ణ సంయుక్తంగా నిర్వహించ తలపెట్టిన పాదయాత్ర శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమై జాతీయ రహదారి మీదుగా రామవరప్పాడు వరకు కొనసాగుతుందని పేర్కొంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement