ఈనాటి ముఖ్యాంశాలు | Today News Round Up 22th March Janata Curfew: Clapping All Over India | Sakshi
Sakshi News home page

ఈనాటి ముఖ్యాంశాలు

Mar 22 2020 7:59 PM | Updated on Mar 22 2020 8:31 PM

Today News Round Up 22th March Janata Curfew: Clapping All Over India - Sakshi

కరోనా వైరస్ కట్టడి చేసేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు జనతా కర్ఫ్యూ విజయవంతంగా కొనసాగుతోంది. జనతా కర్ఫ్యూలో భాగంగా సాయంత్రం 5 గంటలకు కరోనా నియంత్రణకు పనిచేస్తున్న వైద్యులు, అధికార యంత్రాంగానికి యావత్‌ భారతావని చప్పట్లు కొడుతూ ధన్యవాదాలు తెలిపింది.  కరోనా వైరస్‌ పాజిటివ్‌ కోసుల సంఖ్య భారత్‌లో రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 31వరకు అన్ని రైళ్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. తెలంగాణాలో కరోనావైరస్‌ బాధితుల సంఖ్య 22కు చేరింది. ఇదిలా ఉండగా ఏపీ, తెలంగాణలో మార్చి 31 వరకు లాక్‌ డౌన్‌ ప్రకటించారు.ఆదివారం చోటు చేసుకున్న మరిన్నివార్తల కోసం ఈ వీడియో క్లిక్‌ చేయండి.

Advertisement
 
Advertisement
Advertisement