ఆర్తులు, దీనుల పాలిట రక్షకుడిగా ప్రభువైన యెహోవా ప్రియపుత్రునిగా ఏసుక్రీస్తు భువిపై అవతరించిన రోజు క్రిస్మస్.
ఆర్తులు, దీనుల పాలిట రక్షకుడిగా ప్రభువైన యెహోవా ప్రియపుత్రునిగా ఏసుక్రీస్తు భువిపై అవతరించిన రోజు క్రిస్మస్. ఈ పర్వదినాన్ని నేడు జిల్లాలో అత్యంత భక్తిశ్రద్ధలతో.. ఆనందోత్సాహాలతో జరుపుకోనున్నారు. జిల్లాలోని అన్ని చర్చిలు అందంగా ముస్తాబయ్యాయి. మంగళవారం అర్ధరాత్రి నుంచే చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు ప్రారంభమయ్యాయి. గురువులు క్రీస్తు రాకను తెలిపే బైబిల్ సూక్తులు వినిపించారు.