సాక్షి, అమరావతి: తిత్లీ తుపాను ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో రూ.2,800 కోట్ల నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనాలు వచ్చాయని.. తక్షణ సాయంగా రూ.1,200 కోట్లు విడుదల చేయాలని ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం ఆయన ప్రధానికి లేఖ రాశారు. తుపాను వల్ల దెబ్బతిన్న ప్రాంతాలను ఆదుకోవాలని ప్రధానిని కోరారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో రహదారులు, విద్యుత్ వ్యవస్థలకు తీరని నష్టం వాటిల్లిందని తెలిపారు.
ప్రాథమిక అంచనాల ప్రకారం మొత్తం నష్టం విలువ రూ.2,800 కోట్లు కాగా.. అందులో విద్యుత్ రంగానికి సంబంధించి రూ.500 కోట్లు, రహదారులు, భవనాల శాఖకు రూ.100 కోట్లు, పంచాయతీరాజ్కు రూ.100 కోట్లు, వ్యవసాయ రంగానికి రూ.800 కోట్లు, ఉద్యానరంగానికి రూ.వెయ్యి కోట్లు, పశుగణాభివృద్ధి శాఖకు రూ.50 కోట్లు, మత్స్య శాఖకు రూ.50 కోట్లు, ఆర్డబ్ల్యూఎస్కు రూ.100 కోట్లు, జలవనరుల శాఖకు రూ.100 కోట్ల నష్టం వాటిల్లినట్లు పేర్కొన్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ.. సహాయ, పునరుద్ధరణ కార్యక్రమాలను స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ప్రజల కష్టాలు కొంతమేరయినా తీర్చి ఉపశమనం కలిగించడానికి ఉదారంగా, వీలైనంత వేగంగా స్పందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ లేఖను ఢిల్లీలోని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాశ్ పీఎంవోలో అందజేశారు.
తుపాను నష్టం రూ.2,800 కోట్లు
Published Sun, Oct 14 2018 2:00 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆర్మీ ఉద్యోగికి జైలుశిక్ష
హిందూ, ముస్లింలను వేరు చేస్తున్న బీజేపీ
మూగ జీవాలను రక్షించుకోవాలి..
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
తప్పక చదవండి
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- 3 రోజులు తేలికపాటి వానలు!
- బాబును నమ్మితే మళ్లీ బానిస బతుకులే..
- రైతు భరోసా నిధుల విడుదల
- ఏబీసీ పార్టీలది ముస్లిం లీగ్ ఎజెండా: జేపీ నడ్డా
- డీజీపీగా హరీష్కుమార్ గుప్తా
- ‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
Advertisement