తిరుమల సమాచారం
తిరుమల: తిరుమలలో సోమవారం ఉదయం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ఉచిత, రూ.50, రూ.100, రూ.500 గదులు లభించక భక్తులు అవస్థలు పడుతున్నారు. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 30 కంపార్టుమెంట్లూ నిండిపోయాయి. భక్తుల క్యూ వెలుపలి వరకూ ఉంది.
ఉదయం 6 గంటలకు అందిన సమాచారం:
గదుల వివరాలు:
ఉచిత గదులు, రూ.50 గదులు.
రూ.500 గదులు - ఖాళీ లేదు.
రూ.100 గదులు - 16 ఖాళీగా ఉన్నాయి.
ఆర్జిత సేవా టికెట్ల వివరాలు:
ఆర్జిత బ్రహ్మోత్సవం: ఖాళీ లేవు
సహస్ర దీపాలంకరణ సేవ: 45 ఖాళీగా ఉన్నాయి.
వసంతోత్సవం: ఖాళీ లేవు.
సోమవారం ప్రత్యేక సేవ - విశేష పూజ.