కృష్ణాజిల్లా మల్యాలలో దారుణం | Three people attacked by villagers in krishna district due to evil rituals | Sakshi
Sakshi News home page

కృష్ణాజిల్లా మల్యాలలో దారుణం

May 18 2014 11:17 AM | Updated on Sep 2 2017 7:31 AM

గ్రామస్థుల దాడిలో గాయపడిన వ్యక్తులు

గ్రామస్థుల దాడిలో గాయపడిన వ్యక్తులు

కృష్ణాజిల్లా తిరువూరు మండలం మల్యాల గ్రామంలో దారుణం చోటు చేసుకుంది.

కృష్ణాజిల్లా తిరువూరు మండలం మల్యాల గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. క్షుద్రపూజలు చేస్తున్నారనే అనుమానంతో ముగ్గురు వ్యక్తులను గ్రామస్థులు చితకబాదారు. ఆ దాడిలో సదరు వ్యక్తులు తీవ్రంగా గాయపడి, ఆపస్మారక స్థితికి చేరుకున్నారు. దాంతో గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని ఆ ముగ్గురని తిరువురు ఆసుపత్రికి తరలించారు. అయితే వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. మల్యాల గ్రామంలో ఇటీవల స్త్రీలు, చిన్న పిల్లలు అధిక సంఖ్యలో చనిపోతున్నారు.

 

ఆ క్రమంలో అదే గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావు, చిన్నమ్మ, రెడ్డప్పలు చేతబడి చేస్తుండటం వల్లే ఇలా జరుగుతుందని గ్రామస్థులు భావించారు. దాంతో గత అర్థరాత్రి ఉరి చివర ఉన్న ఆ ముగ్గురు వ్యక్తులను గ్రామస్థులు పట్టుకుని... ఊరిలోకి తీసుకువచ్చారు. అనంతరం గ్రామస్థులు వారిని చెట్టుకు కట్టేసి దాడి చేశారు. ఆ దాడిలో వారు తీవ్రంగా గాయపడి ఆపస్మారక స్థితికి చేరుకున్నారు. గ్రామంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దాంతో గ్రామంలో పోలీసులు పికిటింగ్ ఏర్పాటు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement