తూర్పుగోదావరి జిల్లాలో విషాదం | three children died in fire accident at east godavari district | Sakshi
Sakshi News home page

తూర్పుగోదావరి జిల్లాలో విషాదం

Apr 17 2017 10:24 AM | Updated on Sep 5 2018 9:47 PM

తూర్పుగోదావరి జిల్లాలో విషాదం - Sakshi

తూర్పుగోదావరి జిల్లాలో విషాదం

తూర్పుగోదావరి జిల్లాలో విషాద సంఘటన చోటుచేసుకుంది

మారేడుమిల్లి(తూర్పుగోదావరి): తూర్పుగోదావరి జిల్లాలో విషాద సంఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని మరేడుమిల్లి ఏజెన్సీలో ప్రమాదవశాత్తు ఓ పూరిగుడిసెకు మంటలు అంటుకోవడంతో.. అందులో ఉన్న ముగ్గురు చిన్నారులు సజీవదహనమయ్యారు.

ఏజెన్సీలోని ఓ కొండ ప్రాంతంలో పొడు సాగు చేసుకుంటున్న గిరిజనులు అక్కడే గుడిసెలు వేసుకొని జీవిస్తున్నారు. ఈక్రమంలో సోమవారం పెద్దవాళ్లంతా కూలీకి వెళ్లిన సమయంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి గుడిసెలకు అంటుకోవడంతో.. ముగ్గురు చిన్నారులు మంటల్లో చిక్కుకొని అక్కడికక్కడే మృతిచెందారు. దీంతో గిరిజనులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement