తల్లి జాడ తెలియని వైనం
టూటౌన్ పోలీసుల చొరవతో చైల్డ్లైన్ చెంతకు..
ఒంగోలు క్రైం: తల్లి వద్ద నుంచి తన ఇద్దరు కుమారులను రెండు నెలల క్రితం నెల్లూరులో ఉంటున్న తండ్రి తీసుకొని వెళ్లాడు. అంతవరకు బాగానే ఉంది. తిరిగి బిడ్డలను భార్య వద్ద వదిలి పెట్టకుండా ఆమె ఒంగోలులో లేకుండా చూసి ఓ సినిమా హాలు వద్ద వదిలేసి వెళ్లిపోయాడు. ఒంగోలు రైలుపేటలో నివాసం ఉంటున్న కగ్గా శ్రీను, నాగమణికి ఇద్దరు కుమారులు. కగ్గా గోపి (11), కగ్గా రాము(9). అయితే భార్య, భర్త మధ్య మనస్పర్థలు వచ్చాయి. ఇద్దరు వేర్వేరుగా ఉంటున్నారు.
ఈ క్రమంలో రెండు నెలల క్రితం ఇంటికి వచ్చి ఇద్దరు బిడ్డల్ని తీసుకెళ్లిన తండ్రి ఆ తర్వాత ఏమి జరిగిందో ఏమో.. ఉన్నట్టుండి మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో శ్రీనివాసా థియేటర్ వద్ద ఇద్దరు బిడ్డలను వదిలేసి, వారికి రూ.150 ఇచ్చి సినిమాకు వెళ్లమని చెప్పి వెళ్లిపోయాడు. దీంతో ఆ చిన్నారులు థియేటర్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుండగా టూటౌన్ హెడ్ కానిస్టేబుల్ శీనప్ప, కానిస్టేబుల్ ఎస్కే మస్తాన్ వలి గమనించారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైలుపేటలోని వారి ఇంటి వద్దకు తీసుకెళ్లారు.
అయితే ఇంటి వద్ద ఆ చిన్నారుల తల్లి నాగమణి లేదు. స్థానికులను విచారణ చేశారు. ఎక్కడికి వెళ్లిందో తెలియలేదు. దీంతో పోలీసులు చైల్డ్లైన్-1098 ప్రతినిధి బీవీ సాగర్కు సమాచారం ఇచ్చారు. రాత్రి 11.30 గంటల సమయంలో సాగర్ వచ్చి ఆ చిన్నారులను బొమ్మరిల్లు హోంలో చేర్పించారు. బాలల సంక్షేమ మండలి ముందు బుధవారం హాజరు పరిచారు. వారి ఆదేశాల మేరకు ఇద్దరు పిల్లలను అదే హోంలో చేర్పించారు.
బిడ్డలను రోడ్డుపై విడిచి చెక్కేసిన తండ్రి
Published Thu, Jun 18 2015 6:58 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement