► ప్రపంచ బ్యాంకు ప్రతినిధులను
► కోరిన కర్నూలు ఎంపీ బుట్టా రేణుక
► ఏడేళ్ల ప్రాజెక్టు ద్వారా ఉపశమనం కల్గిస్తాం : ఐప్యాడ్ ప్రతినిధి వెల్లడి
కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు జిల్లాలో తీవ్రమైన కరువు పరిస్థితులున్నాయని ప్రపంచ బ్యాంకు ద్వారా జిల్లాను ఆదుకోవాలని కర్నూలు ఎంపీ బుట్టా రేణుక.. డ్రాఫ్ట్ ఐఎఫ్ఏడీ(ఐప్యాడ్) ప్రతినిధులను కోరారు. శనివారం రాత్రి స్టేట్ గెస్ట్హౌస్లో ప్రపంచ బ్యాంకు తరఫున వచ్చిన ఐప్యాడ్ ప్రతినిధులతో ఎంపీ సమావేశమై జిల్లా కరువు పరిస్థితులను వివరించారు. ఇటలీకి చెందిన ఐప్యాడ్ ప్రతినిధులు అండ్రీనెప్యూడి ఐసాటూర్ , ఆ సంస్థ ఇండియా ప్రతినిధులు విన్సెం ట్ డార్లాంగ్, సన్ప్రీత్ కౌర్.. గురు, శుక్రవారాల్లో ఓర్వకల్లు, ఆళ్లగడ్డ, డోన్ మండలాల్లో కరువు పరిస్థితులను, ప్రకృతి వ్యవసాయ విధానాలను పరిశీలించారు. ప్రపంచ బ్యాంకు తరపున ఈ బృందం జిల్లాలో పర్యటిస్తోంది. శనివారం స్టేట్ గెస్ట్హౌస్కు చేరుకుంది.
ముందుగా జిల్లాకలెక్టర్ సి.హెచ్.విజయమోహన్ను ఆయన ఛాంబర్లో కలిశా రు. కలెక్టర్ జిల్లాలోని కరువు పరిస్థితులను ఐప్యాడ్ ప్రతినిధులకు వివరించారు. అనంతరం స్టేట్ గెస్ట్హౌస్లో సమావేశమైన ఎంపీ బుట్టా రేణుక మాట్లాడుతూ.. జిల్లాలో వరుసగా కరువు వస్తుండటం వల్ల రైతు లు తీవ్రమైన కష్టాల్లో మునిగి తేలుతున్నారని తెలిపారు. ముఖ్యంగా ఆదోని, కర్నూలు డివిజన్లలో కరువు పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయని వివరించారు. జిల్లా మ్యాపు ద్వారా కరువు ప్రాంతాలను చూపించా రు. ప్రపంచ బ్యాంకు ద్వారా కరువు జిల్లాకు చేయూతనివ్వాలని సూచించా రు. డ్రాఫ్ట్ ఐప్యాడ్ టీమ్ లీడర్ అండ్రి నెఫ్యూడి మాట్లాడుతూ తొలి విడతలో రాయలసీమతో పాటు ప్రకాశం జిల్లాలో పర్యటించి కరువు పరిస్థితులను అధ్యయనం చేస్తున్నట్లు తెలిపారు.
మరో టీమ్ జూన్ నెల 5వ తేదీన జిల్లాకు వచ్చి కరువు పరిస్థితులను మరోసారి పరిశీలి స్తుందని తెలిపారు. రాయలసీమ జిల్లాలతో పాటు ప్రకాాశం జిల్లాలో ప్రపంచ బ్యాంకు నిధులతో ఏడేళ్ల ప్రాజెక్టు ద్వారా ఉపశమనం కల్గిస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో జేడీఏ ఉమామహేశ్వరమ్మ, డీడీఏ గణపతి, ఏడీఏ వెంకటేశ్వరరెడ్డి, వ్యవసాయ శాఖ కమిషనరేట్ అధికారి రమణ తదితరులు పాల్గొన్నారు. ఐప్యాడ్ ప్రతినిధులు జిల్లా పర్యటన ముగించుకుని ఆదివారం తిరిగి వెళ్లనున్నారు.
కరువు జిల్లాను ఆదుకోండి
Published Sun, May 29 2016 3:00 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- Banjara Hills: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి
- తెలంగాణలో భానుడి భగభగలు..!
- తాతా.. నీకు టాటా..
- రోహిత్ వేముల ఆత్మహత్య కేసు మళ్లీ దర్యాప్తు చేస్తాం
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- కందికుంట అడ్డంగా దొరికినా..
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
- కళ్లు చల్లబడ్డాయా బాబూ!
Advertisement