శాసనసభ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
హైదరాబాద్: శాసనసభ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తెలంగాణ బిల్లు ఈరోజు శాసనసభలో తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. తెలంగాణ ముసాయిదా బిల్లును బీఏసీలో చర్చించకుండా, సభ అనుమతి లేకుండా చర్చకు అనుమతించడాన్ని ఆ పార్టీ వ్యతిరేకిస్తోంది. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా శాసనసభలో నిరసన కొనసాగించాలని ఆ పార్టీ నిర్ణయించింది. రాత్రంతా అసెంబ్లీ ప్రాంగణంలోనే ఉండాలని ఆ పార్టీ శాసనసభ్యులు నిర్ణయించుకొని అక్కడే ఉన్నారు.
ఇదిలా ఉండగా, తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు కూడా అసెంబ్లీ ప్రాంగణంలోనే ఉన్నారు. దాంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.
అసెంబ్లీ ప్రాంగణంలోకి పోలీసులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యేల అరెస్టుకు సన్మాహాలు చేస్తున్నారు. స్పీకర్ అనుమతితో ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసే అవకాశం ఉంది.