ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ను ముట్టడించిన విద్యార్థులు | telangana students protest at ntr trust bhavan against polavaram ordinance | Sakshi
Sakshi News home page

ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ను ముట్టడించిన విద్యార్థులు

Jul 14 2014 2:15 PM | Updated on Sep 4 2018 5:07 PM

పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాలను ఆంధ్రప్రదేశ్‌లో కలుపుతూ లోక్‌సభలో ఆర్డినెన్స్ సవరణను కేంద్రం ఆమోదించడంపై తెలంగాణ వాదుల నిరసన జ్వాలలు తీవ్రరూపం దాల్చుతున్నాయి.

హైదరాబాద్:పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాలను ఆంధ్రప్రదేశ్‌లో కలుపుతూ లోక్‌సభలో ఆర్డినెన్స్ సవరణను కేంద్రం ఆమోదించడంపై తెలంగాణ వాదుల నిరసన జ్వాలలు తీవ్రరూపం దాల్చుతున్నాయి. ఈ అంశానికి సంబంధించి మొన్న బీజేపీ కార్యాలయంపై దాడికి దిగిన తెలంగాణ ఆందోళన కారులు.. తాజాగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ను ముట్టడించారు. సోమవారం తెలంగాణ విద్యార్థి సంఘాలు టీడీపీ ట్రస్ట్ భవన్ ఎదుట భారీ నిరసన చేపట్టాయి. ఓ దశలో ఎన్టీఆర్ భవన్ లో కి దూసుకెళ్లేందుకు విద్యార్థులు యత్నించడంతో వారిని పోలీసులు అడ్డగించారు. దీంతో అక్కడి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement