భారీగా మద్యం పట్టివేత..

Telangana Liquor Bottles Seized In Krishna District - Sakshi

సాక్షి, విజయవాడ: లాక్‌డౌన్‌ నేపథ్యంలో మద్యం అ‍మ్మకాలపై ప్రభుత్వం ఆంక్షలు విధించినప్పటికీ కొందరు అక్రమంగా రాష్ట్రాల సరిహద్దులు దాటి సరఫరా చేస్తున్నారు. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు అక్రమంగా తరలిస్తున్న భారీ మద్యాన్ని మంగళవారం తెల్లవారుజామున కృష్ణా జిల్లా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నందిగామ మండలం జొన్నలగడ్డ చెక్‌ పోస్ట్‌ వద్ద టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల తనిఖీల్లో సుమారు రెండు లక్షల రూపాయల విలువైన మద్యం పట్టుబడింది. మద్యాన్ని తరలిస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్ట్‌ చేయడంతో పాటు, మూడు బైక్ లను  పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top