పెండ్లిమర్రి, న్యూస్లైన్ : ఉపాధ్యాయుల నిర్లక్ష్యానికి విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. ఐరన్ ట్యాబ్లెట్లు వికటించి దాదాపు 30 మంది విద్యార్థులు కడుపునొప్పి, వాంతులతో అస్వస్థతకు గురయ్యారు. స్థానిక ఆర్ఎంపీ వైద్యుడితో పాటు నందిమండలం పీహెచ్సీ వైద్యులు పాఠశాలలోనే విద్యార్థులకు వైద్య పరీక్షలు చేశారు.
విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనతో పాఠశాలకు చేరుకున్నారు. ఉపాధ్యాయుల నిర్లక్ష్యం వల్లనే ఇలా జరిగిందని ఆరోపించారు. వివరాల్లోకి వెళితే.. పెండ్లిమర్రి మండలం నందిమండలం జిల్లా పరిషత్ ైెహ స్కూల్లో శనివారం ఉద యం 11 గంటలకు పాఠశాల ఇన్ఛార్జి హెచ్ఎం కేశవ ఆధ్వర్యంలో 250 మంది విద్యార్థులకు ఐరన్ మాత్రలు ఇచ్చారు. మాత్రలు తిన్న కొద్ది సేపటికే విద్యార్థులు అస్వస్థతకు గురై సొమ్మసిల్లి పడిపోయారు. కొందరు కడుపునొప్పితో మరికొందరు వాంతులతో ఇబ్బందులు పడ్డారు.
విషయం తెలుసుకున్న ఉపాధ్యాయులు దగ్గరలో ఉన్న ఆర్ఎంపీ వైద్యుడు మహ్మద్ రఫీ, నందిమండలం పీహెచ్సీ వైద్యుడు మాధవరెడ్డికి సమాచారం ఇచ్చారు. వారు హుటాహుటిన పాఠశాలకు చేరుకుని విద్యార్థులకు ఇంజెక్షన్తో పాటు ఓఆర్ఎస్ ద్రావణం ఇచ్చారు. చెన్నూరు క్లస్టర్ వైద్యుడు ఇబ్రహీం, తహశీల్దార్ వేదనాయకం, వీఆర్వో సాంబశివారెడ్డి పాఠశాలకు చేరుకుని విద్యార్థులను పరామర్శించారు. తాము ఇంటిదగ్గరే టిఫిన్ చేసినట్లు విద్యార్థులు చెప్పడంతో ఐరన్ మాత్రలు ఇచ్చినట్లు ఇన్చార్జి హెచ్ఎం కేశవ పేర్కొన్నారు.
ఉదయం ఇవ్వడం వల్లనే...
పాఠశాలల్లోని విద్యార్థులకు ప్రతి గురువారం భోజనం చేసిన తర్వాత ఐరన్ ట్యాబ్లెట్లు అందజేయాలని ప్రభుత్వం సూచించింది. గురువారం విద్యార్థులు తక్కువగా ఉన్నారని శనివారం ఉదయం 11 గంటలకు ఐరన్ ట్యాబ్లెట్లు ఇచ్చారు. అన్నం తినకుండా ఖాళీ కడుపుతో మాత్రలు తీసుకోవడంతో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.
పీహెచ్సీ వైద్యుడు మాధవరెడ్డి ఏమంటున్నారంటే...
విద్యార్థులు అన్నం తిన్న తర్వాత ఐరన్ ట్యాబ్లెట్స్ ఇవ్వాలి. ఉదయం 11 గంటలకే మాత్రలు ఇవ్వడం వల్ల ఇలా జరిగింది. వైద్యసేవలు అందించడంతో విద్యార్థులు కోలుకున్నారు.
నిర్లక్ష్యం వల్లనే ఇలా జరిగింది
ఇన్ఛార్జ్ హెచ్ఎం కారణంగానే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్నం ఇవ్వాల్సిన మాత్రలు ఉదయమే ఇచ్చారు. ఇది ముమ్మాటికి నిర్లక్షమే.
- వెంకటసుబ్బయ్య,
విద్యార్థి తండ్రి, నంది మండలం
మాత్రలు వికటించి..
Published Sun, Feb 9 2014 2:32 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement