మత్స్యకారులపై కక్ష
శ్రీకాకుళం: ఇచ్ఛాపురం మున్సిపాలిటీలో 5వ వార్డులో మత్స్యకారులంతా వైఎస్సార్సీపీకి మద్దతు ఇస్తున్నారని పాలకులు కక్ష సాధిస్తున్నారు. స్వదేశీ మత్స్యకారుల కో ఆపరేటివ్ సొసైటీ చెరువుల్లో రొయ్యలు, చేపలు పెంచుతూ జీవనం సాగిస్తున్నాం. మొత్తం 333 మంది ఈ సొసైటీలో సభ్యులుగా ఉండేవారు. వైఎస్సార్సీపీ సానుభూతి పరులను తొలగించి, కేవలం 46 మంది టీడీపీ మద్దతుదారులతోనే ప్రస్తుతం ఈ సొసైటీ నిర్వహిస్తున్నారు. దీనిపై నిలదీస్తే కక్ష సాధిస్తున్నారు. అక్రమంగా పోలీస్ కేసులు పెడుతున్నారు.– మేఘనాథ్ బెహరా, ఇచ్ఛాపురం