వైఎస్ఆర్ సీపీ నాయకులపై ఇనపరాడ్లతో దాడి | TDP Leaders attacks YSRCP Leaders in Guntur district | Sakshi
Sakshi News home page

వైఎస్ఆర్ సీపీ నాయకులపై ఇనపరాడ్లతో దాడి

Aug 22 2014 9:24 AM | Updated on Aug 24 2018 2:36 PM

టీడీపీ ఆగడాలకు అడ్డే లేకుండా పోతోంది. అధికారంలో ఉన్నామనే అహంకారంతో తెలుగు తమ్ముళ్లు...

గుంటూరు : టీడీపీ ఆగడాలకు అడ్డే లేకుండా పోతోంది. అధికారంలో ఉన్నామనే అహంకారంతో తెలుగు తమ్ముళ్లు... వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై చేస్తున్న దాడులు రోజురోజూకు పెరిగిపోతున్నాయి. గుంటూరు జిల్లా పిడుగురాళ్లలోని ప్రజాశక్తినగర్లో శుక్రవారం వైఎస్ఆర్ సీపీ నాయకులపై టీడీపీ నేతలు ఇనుపరాడ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో నలుగురు వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. దాంతో వారిని గురజాల ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement