తెలుగుదేశం శాసనసభ పక్ష సమావేశం కాసేపట్లో జరగనుంది.
హైదరాబాద్: తెలుగుదేశం శాసనసభ పక్ష సమావేశం కాసేపట్లో జరగనుంది. తిరుపతిలో బుధవారం రాత్రి జరిగే ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును శాసనసభ పక్ష నేతగా ఎన్నుకుంటారు.
చంద్రబాబు ఇప్పటికే తిరుపతికి చేరుకున్నారు. ఈ సమావేశంలో టీడీపీ సీనియర్ నేతలు పాల్గొంటారు. ఈ నెల 8న చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.