ఉత్తరాంధ్ర వలసలపై స్పీకర్‌ కన్నీళ్లు | Tammineni Sitaram tears over Uttarandra people migration | Sakshi
Sakshi News home page

ఉత్తరాంధ్ర వలసలపై స్పీకర్‌ కన్నీళ్లు

Dec 31 2019 4:20 AM | Updated on Dec 31 2019 4:20 AM

Tammineni Sitaram tears over Uttarandra people migration - Sakshi

భావోద్వేగంతో మాట్లాడుతున్న స్పీకర్‌ తమ్మినేని సీతారాం

పొందూరు: ఉత్తరాంధ్ర వెనుకబాటుతనంపై మాట్లాడుతూ స్పీకర్‌ తమ్మినేని సీతారాం కన్నీటి పర్యంతమయ్యారు. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం స్పీకర్‌ పర్యటించారు. ఈ సందర్భంగా తండ్యాం గ్రామంలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ విజయవాడ, చెన్నై, ఢిల్లీ, ముంబై.. ఇలా ఏ నగరాలకెళ్లినా అక్కడ ఉత్తరాంధ్ర ప్రజలు వచ్చి పలకరిస్తుంటే సంతోషించాలో, బాధపడాలో తెలీని పరిస్థితి దాపురించిందని కన్నీరు పెట్టుకున్నారు.

ఇంతమంది వలస వెళుతుంటే.. ఇక ఈ పదవులెందుకు?.. అనిపిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర రాజధాని అయితేనే ఈ పరిస్థితిని పారదోలవచ్చని.. రాజధానిగా ప్రకటించిన సీఎం వైఎస్‌ జగన్‌కు చేతులెత్తి నమస్కరిస్తున్నానంటూ ఉద్వేగానికి లోనయ్యారు. విశాఖ రాజధానిని కలిసి పోరాడి సాధించుకుందామని స్పీకర్‌ పిలుపునిచ్చారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement