వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఉన్నత పాఠశాల విద్యార్థులకు(8 , 9, 10 తరగతులు) ప్రత్యేక సబ్జెక్టుగా కంప్యూటర్ విద్యను అందించాలని విద్యా శాఖ భావిస్తోంది.
- 8 నుంచి పదో తరగతి వరకు అమలుకు విద్యా శాఖ ప్రతిపాదనలు
సాక్షి, హైదరాబాద్: వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఉన్నత పాఠశాల విద్యార్థులకు(8 , 9, 10 తరగతులు) ప్రత్యేక సబ్జెక్టుగా కంప్యూటర్ విద్యను అందించాలని విద్యా శాఖ భావిస్తోంది. ఇందులోభాగంగా రాష్ట్రంలోని 5 వేల ఉన్నత పాఠశాలల్లో దీన్ని అమలు చేసేందుకు కంప్యూటర్ టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి విద్యా శాఖ ప్రతిపాదనలు పంపించింది. 8, 9 వ తరగతులకు 7వ పేపరుగా, పదో తరగతిలో 12వ పేపరుగా దీని పరీక్ష కూడా నిర్వహిస్తారు. మరోవైపు విద్యార్థుల స్కాలర్షిప్పులు కాజేసిన ఇంజనీరింగ్ కాలేజీల తీరుపై ప్రభుత్వం ఆగ్రహంగా ఉంది. మరిన్ని కాలేజీలపై కేసులు నమోదు చేస్తోంది. విద్యార్థుల డూప్లికేషన్ , ఒకే ఫ్యాక ల్టీ వివిధ కాలేజీల్లో పనిచేయడం వంటి అక్రమాలపై ఈ కేసులు నమోదవుతున్నాయి.