ప్రత్యేక హోదా సాధన పోరు ఉద్ధృతం | Special Status Is Main Part Of YSRCP And CPI,CPM Leaders | Sakshi
Sakshi News home page

ప్రత్యేక హోదా సాధన పోరు ఉద్ధృతం

Apr 25 2018 7:02 AM | Updated on Mar 23 2019 9:10 PM

Special Status Is Main Part Of  YSRCP  And CPI,CPM Leaders - Sakshi

బంద్‌లో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త కంగాటి శ్రీదేవి, సీపీఐ, సీపీఎం నాయకులు

పత్తికొండ టౌన్‌ : ఏపీకి ప్రత్యేక హోదా సాధన పోరు మరింత ఉద్ధృతం చేద్దామని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త కంగాటి శ్రీదేవి, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం.నబీరసూల్, సీపీఎం మండల కార్యదర్శి ఎం.దస్తగిరి అన్నారు. ప్రత్యేక హోదా సాధన సమితి పిలుపు మేరకు మంగళవారం రాత్రి పత్తికొండలో విపక్షాలు బిజిలీ బంద్‌ నిర్వహించాయి. సాయంత్రం 7 నుంచి 7.30 గంటల వరకు విద్యుత్‌ లైట్లు ఆర్పివేసి, బ్లాక్‌డేగా పాటించారు. ప్రజలు కూడా స్వచ్ఛందంగా లైట్లు ఆర్పివేసి, బంద్‌కు మద్దతు తెలిపారు. వైఎస్సార్‌సీపీ, సీపీఐ, సీపీఎం నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా వచ్చి, నాలుగు స్తంభాల మంటపం వద్ద ఆందోళన చేపట్టారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ, టీడీపీ రెండూ రాష్ట్ర ప్రజలను మోసం చేశాయన్నారు. సీఎం చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని, ఎప్పటికప్పుడు మాటలు మారుస్తూ రాజకీయ డ్రామాలు ఆడుతున్నాడన్నారు. హోదా ఉద్యమాన్ని పక్కదారి పట్టించేందుకు కుట్రలు చేస్తున్నారన్నారు. ప్రజలు చైతన్యమై, విపక్షాల పోరాటానికి మద్దతు పలకాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యదర్శి శ్రీరంగడు, మండల కన్వీనర్‌ జూటూరు బజారప్ప, నాయకులు నజీర్, భరత్‌రెడ్డి, లక్ష్మన్న, సీపీఐ నాయకులు సురేంద్ర, రాజాసాహెబ్, నెట్టికంటయ్య, సీపీఎం నాయకులు రంగారెడ్డి, వెంకటేశ్వరరెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement