నేడు గుంటూరులో హోదా భరోసా సభ | Special status barosa sabha in guntur today | Sakshi
Sakshi News home page

నేడు గుంటూరులో హోదా భరోసా సభ

Jun 4 2017 1:50 AM | Updated on Mar 23 2019 9:10 PM

నేడు గుంటూరులో హోదా భరోసా సభ - Sakshi

నేడు గుంటూరులో హోదా భరోసా సభ

కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం గుంటూరులో జరగనున్న ప్రత్యేక హోదా భరోసా సభకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి.

హాజరుకానున్న రాహుల్‌గాంధీ
 
సాక్షి, గుంటూరు: కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం గుంటూరులో జరగనున్న ప్రత్యేక హోదా భరోసా సభకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. యూపీఏ మిత్రపక్షాలకు చెందిన జాతీయ స్థాయి నేతలు కూడా ఈ సభలో పాల్గొని ప్రత్యేక హోదా నినాదాన్ని వినిపించనున్నారు.

ఆదివారం సాయంత్రం 5.30 నుంచి 7.30 వరకు గుంటూరు నగరంలోని పొన్నూరు రోడ్డులో ఉన్న ఆంధ్రా ముస్లిం కళాశాల ప్రాంగణంలో బహిరంగ సభ జరుగనుంది. రాహుల్‌ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు కృష్ణా జిల్లాలోని గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. సాయంత్రం 4.30కు విజయవాడ నుంచి రోడ్డు మార్గంలో గుంటూరులోని ఆంధ్రా ముస్లిం కళాశాల ప్రాంగణానికి చేరుకుంటారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement