కర్నూలు జిల్లా మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్రస్వామిని సోమవారం తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి దర్శించుకున్నారు.
కర్నూలు జిల్లా మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్రస్వామిని సోమవారం తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి దర్శించుకున్నారు. అలాగే, తెలంగాణ రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ నిరంజన్రెడ్డి, కర్నాటక రాష్ట్రం కడూరు వై.ఎస్.వి దత్త, కర్నూలు డీఐజీ రమణకుమార్, జార్ఖండ్ ఎస్పీ రమేష్ వేర్వేరు సమాయాల్లో మంత్రాలయం వచ్చారు. వీరు ముందుగా గ్రామ దేవత మంచాలమ్మను దర్శించుకున్నారు. అనంతరం శ్రీ రాఘవేంద్రస్వామి మూలబృందావనంను దర్శించుకున్నారు. వీరికి శ్రీ మఠం పీఠాధిపతి ఆశీర్వాచనం అందజేశారు.